గుర్తి తెలియని వాహనం ఢీకొని తల్లీ కుమారుడు మృతి

మృతులు నల్లగొండ జిల్లా వాసులుగా గుర్తింపు
గుంటూరు,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): గుంటూరు శివారు బుడంపాడు సవిూపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం.. ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి యాదమ్మ(32), కుమారుడు చరణ్‌(10) మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను నల్లగొండ జిల్లా నకిరేకల్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు. రహదారి పక్కన ట్రాక్టర్‌ కింద ముగ్గురు నిద్రిస్తుండగా.. వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం.. ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్దారించారు.  ఈ ఘటనలో తల్లి యాదమ్మ (32) , కుమారుడు చరణ్‌ (10) మృతిచెందగా తండ్రి దుర్గయ్య గాయపడ్డారు. బాధితులను నల్గొండ జిల్లా నకిరేకల్‌ వాసులుగా గుర్తించారు.