గులాంనబీ ఆజాద్తో భేటీ కానున్న సీఎం కిరణ్ కుమార్
న్యూఢిల్లీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ గులాం నబీ ఆజాద్తో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో కళంకిత మంత్రులు , మంత్రి వర్గ మార్పులు, చేర్పులపై చర్చిస్తున్నట్లు సమాచారం. దిగ్విజయ్సింగ్తో భేటీ ముగిసిన అనంతరం ఆజాద్తో సమావేశమయ్యారు. హస్తినలో తీరిక లేకుండా గడుపుతున్న సీఎం అధిష్టాన పెద్దలతో కీలక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఆజాద్తో భేటీ ముగిసిన అనంతరం సీఎం హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉంది.