గెలుపుకోసం ఆరాట పడుతున్న రాజస్థాన్, సన్ రైజర్స్
ఢిల్లీ,జనంసాక్షి: ఐపిఎల్లో ప్రవేశించిన మొదటిసారే ప్లే-ఆఫ్స్కు చేరుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్ మ్యాఛ్లో రాజస్థాన్ రాయల్స్ను ఈ రాత్రికి ఢీకొననుంది. లీగ్ స్టేజిలో ఈ రెండు జట్లు చెరొక మ్యాచ్ గెలిచి సమవుజ్జీలుగా ఉన్నందున తటస్థ వేదిక ఢిల్లీలో హోరా హోరి సమరం తప్పదు. సన్రైజర్స్ బౌలింగ్కు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్కు పోరాటంలో ఎవరు గెలిచినా, ఫైనల్లో ప్లేస్ కోసం కోల్కతాలో జరుగనున్న సెకండ్ క్వాలిఫయర్లో తలపడాల్సి వుంటుంది.
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ పెద్దగా శ్రమ పడకుండానే లీగ్ స్టేజ్ దాటేసి ప్లే-ఆఫ్స్కు చేరుకుంది. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల స్డేడియంలో జరగనున్న ఈ నాకౌట్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో మరింత కాన్ఫిడెన్స్తో సన్రైసర్స్ తల పడనుంది. ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్ల్ని చెరొకటి గెలిచినప్పటికీ , ఇటీవలి ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ బౌలర్ల మెరుపు దాడికి రాజస్థాన్ రాయల్స్ చిత్తయిపోవడం మైదరాబాదీ ఫ్యాన్స్లో ధీమా పెంచింది. మొత్తం మీద ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం కోసం ఆరాటం పడుతున్నాయి.