గొంతుకోసి..సొమ్ము అపహరణ

హైదరాబాద్‌, జూలై 11 : పాట్నీ సెంటరులో ఓ దారుణం చోటు చేసుకుంది. 2 వేల రూపాయల కోసం ఒక యువకుడి గొంతుకోసి దోచుకుపోయిన వైనం పాట్నీ సెంటరులో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. పాట్నీ సెంటరులో వెళుతున్న తనను ఒక మహిళ, ఒక యువకుడు అటకాయించి తన వద్ద ఉన్న 2 వేల రూపాయలను దోచుకోవడమే గాక వెళ్లేటప్పుడు బ్లేడుతో గొంతు మీద కోశారని తెలిపారు. బాధతో విలవిలలాడుతున్న తనను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.