గోదావరి తీరంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు – మంథని మున్సిపల్ చైర్ పర్సన్

పుట్ట శైలజ జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గల గోదావరి తీరంలో మహాశివ రాత్రి పండగ సందర్భంగా గోదావరి తీరంలో స్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ సిబ్బందితో మంథని మునిసిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ పనులను దగ్గరుండి చేపిస్తూ, పనులను పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు . వారి వెంట వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్ తదితరులు ఉన్నారు.