గోదావరి దాటుతూ మునిగిపోయిన వ్యక్తి మృతి

ఏలూరు,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): గోదావరి తీరం దాటుతుండగా.. ప్రమాదవశాత్తూ నీళ్ల లోతులోకి వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునురు మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన యార్ణం రమణయ్య (45) అనే వ్యక్తి మూడు రోజుల క్రితం తన స్వగ్రామమైన మాధవరం నుండి తూర్పు గోదావరి జిల్లా గౌరీ దేవిపేటకు కాలి నడకన బయలుదేరి వెళ్లాడు. మార్గ మధ్యంలో గోదావరి తీరం దాటుతుండగా.. ప్రమాదవశాత్తు నీళ్ల లోతుల్లోకి వెళ్లి రమణయ్య మృతి చెందాడు. రమణయ్య ఆచూకీ కోసం కుటుంబీకులు గత మూడు రోజులుగా వెతుకుతుండగా..  శుక్రవారం ఉదయం గ్రామస్తులు రమణయ్య మృత దేహాన్ని గోదావరిలో కనుగొని వెలుపలికి తీశారు.