గోదావరి వద్ద శివరాత్రికి ఏర్పాట్లు చేయాలి 

ఖానాపూర్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి): ఖానాపూర్ పట్టణంలోని ఉత్తర వాహిని గోదావరి నది తీరం వద్ద ఈనెల 18న శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తులకు తగు ఏర్పాట్లు చేయాలని హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ కు వినతిపత్రం అందజేశారు. గోదావరి వద్ద ఉన్న పుష్కర ఘాట్లతోపాటు రహదారిని శుభ్రం చేయాలని కోరారు మహిళలకు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు చిన్న పిల్లలకు జల్లు స్నానాలు చేసే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో హిందు ఉత్సవ సమితి అధ్యక్షులు రాచమల్ల రాజశేఖర్, వ్యవస్థాపక అధ్యక్షులు అల్లాడి వెంకటేశ్వర్లు, నాయకులు బండారి కిషోర్, కొక్కుల ప్రదీప్, కౌట మహేష్, లక్ష్మణ్ తదితరులున్నారు.