గోపీనాథ్‌ ముండేకు నోటీసులు జారీ చేసిన ఆదాయపన్నుశాఖ

ముంబయి,(జనంసాక్షి): ఎన్నికల ఖర్చుపై భాజపా నేత గోపీనాథ్‌ ముండే చేసిన వ్యాఖ్యలు ఆయనకు కష్టాలు కొనితెచ్చాయి. తాజాగా ఆదాయపన్ను శాఖ ఆయనకు నోటీసులు జారీ చేసింది. లోఖ్‌సభ ఎన్నికల ప్రచారానికి రూ. 8 కోట్లు ఖర్చు పెట్టామని ముండే గతవారం ఒక సభలో పేర్కొన్న విషయం విదితమే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఈసీ ఇప్పటికే ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.