గోమాతల సంరక్షణకు కేంద్రం ప్రత్యేక కృషి

గోమాతల సంరక్షణకు కేంద్రం ప్రత్యేక కృషి

భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్ 30

నిర్మల్ జిల్లా , భైంసా పట్టణంలోని గోవుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఎంపీ ల్యాండ్స్ రూ. 10 లక్షలతో గోశాల షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. గోవులను ప్రతి ఒక్కరు పూజించాలన్నారు. గోహత్యాల నివారణకు తమ ప్రభుత్వం చర్యల తీసుకుంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హిందూవాహిని రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుప్పాల రాజన్న, బిజెపి జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామారావు పటేల్, మోహన్ రావు పటేల్, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు,గోశాల సంరక్షణ సమితి అధ్యక్షులు ప్రవీణ్ తదితరులు ఉన్నారు.