గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను కళాశాల ప్రధానోపాధ్యాయులు భీమార్జున్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల జ్ఞాన సముపార్జనకు సర్వతోముఖాభివృద్ధికి  గ్రంధాలయాలే తొలిమెట్టు అని అన్నారు. విద్యార్థులు గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం కళాశాల గ్రంధాలయ అధికారి నాగరాజు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు గ్రంథాలయాలు దిక్సూచిలా పనిచేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేత్ర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు