ఘనంగా గాంధీ జయంతి వేడుక.

ఘనంగా గాంధీ జయంతి వేడుక.

బూర్గంపహాడ్ అక్టోబర్ 02 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి ఆధ్వర్యంలో గాంధీజయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఆశయాలు, మహాత్మునిగా ఎదిగిన విధానానం, మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతం ప్రపంచ దేశాలకే ఆదర్శమని బార్ల నాగమణి కొనియాడారు. స్వతంత్ర ఉద్యమంలో మహాత్ముని పాత్ర మరువలేనిదని, అది ప్రపంచ దేశాలకే ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో
మండల ప్రధాన కార్యదర్శి మంద నాగరాజు, సీనియర్ నాయకులు పుట్టి ముత్యం, తోకల రాంబాబు, యువ నాయకుడు లక్ష్మణ్, చన్నం రమేష్, సత్యనారాయణ, గణేష్, ఎస్కే మైబు తదితరులు పాల్గొని మహాత్ముని స్మరించారు.