ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ జీ జయంతి వేడుకలు.

గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 2 జనం సాక్షి.
గద్వాల జిల్లా కేంద్రంలోని జాతిపిత మహాత్మా గాంధీజీ 154వ జయంతి సందర్భంగా చింతలపేట సమీపంలో లోని గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచం శాంతి కి మార్గదర్శిఅని గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. దేశం అంతటిని ఒకే తాటిపైకి తెచ్చి స్వాతంత్రాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర వహించి తన చివరి శ్వాస వరకు శాంతి అహింసా మార్గాలను ప్రచారం చేశారు. బడుగు బలహీన అభ్యున్నతి కృషిచేసిన వ్యక్తి అని , గ్రామ పంచాయతీలు బాగు పడినప్పుడు గ్రామ పంచాయతీలు బాగుపడే రోజు దేశం బాగుపడుతుందని గ్రామాలు అభివృద్ధి చెందాలని, స్వచ్ఛభారత్ ఆకాంక్షించారు తెలిపారు.గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కెసిఆర్ తో సాధ్యమవుతుంది.నేటి యువత గాంధీ ఆశయాలను కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బి.ఎస్ కేశవ్ , రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప , జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ చైర్మన్ బాబర్, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, కౌన్సిలర్స్ కృష్ణ, నరహరి శ్రీనివాసులు, మహేష్, నాగరాజు, శ్రీను,నరహరి గౌడ్ , కె.టి దొడ్డి మండల పార్టీ అధ్యక్షుడు ఉరుకుందు, గద్వాల టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ధర్మ నాయుడు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రీనివాస్ రెడ్డి, నాగులు యాదవ్, రంజిత్, రామకృష్ణ శెట్టి, రిజ్వాన్, భగీరథ వంశీ కురుమన్న ,మోబిన్, చిన్న, వీరేష్ , కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.