ఘనంగా దామోదర రాజనర్సింహా జన్మదిన వేడుకలు

మాజీ డిఫ్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా జన్మదిన వేడుకలను టేక్మాల్ బస్టాండ్ ఆవరణలో  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు  ఘనంగా జరుపుకొన్నారు. మండల పరిధిలోని ఆయా గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు మండల కేంద్రానికి చేరుకుని వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసుకుని సంబురాలను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పరితపించే వ్యక్తి దామోదర రాజనర్సింహా అని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సర్వని సరోజ, ఎంపీటీసీ నిమ్మ వాణి, కో ఆప్షన్ సభ్యుడు మజహర్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నిమ్మరమేష్, టేక్మాల్ గ్రామ అధ్యక్షుడు భక్తుల కిషోర్, నాయకులు తిమ్మి గారి సుధాకర్, దొడ్ల మోహన్, ఆకులపల్లి పాపయ్య, శివమల్లయ్య, శివాగౌడ్, రాజు, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.