ఘనంగా ముగిసిన వినాయకుని నిమజ్జన శోభాయాత్ర

ఘనంగా ముగిసిన వినాయకుని నిమజ్జన శోభాయాత్ర

రాజంపేట్ అక్టోబర్ 1 జనంసాక్షిరాజంపేట్ మండల కేంద్రంలోని వినాయకుని నిమజ్జనం శోభాయాత్ర కార్యక్రమం శనివారం సాయంత్రం ప్రారంభమై ఆదివారం సాయంత్రం వరకు ఘనంగా కొనసాగింది ఈ శోభాయాత్రకు ఏర్పాట్లు చేసిన వివిధ కుల సంఘాల యూత్ క్లబ్ యువజన సంఘాలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుల ప్రతిమలను భారీ ఎత్తున అంగరంగ వైభవంగా ముస్తాబు చేసి నిమర్జనానికి తరలించారు ఈ శోభయాత్రను రాజంపేట్ మండల కేంద్రంలో బస్టాండ్ నుండి గాంధీ చౌక్ చావడి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి దేవుని చెరువుకు నిమజ్జనం కొరకు భారీ వినాయకుల విగ్రహాలను వాహనాలపై ప్రత్యేకంగా అలంకరించారు వివిధ రంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు డిజె సౌండ్లకు అనుగుణంగా డాన్సులు చేస్తూ శోభయాత్రను ఘనంగా నిర్వహించారు కలకత్తా మహారాష్ట్ర నుండి నేషనల్ గా ఏర్పాటు చేసిన డప్పు వాయిదాలతో మండల కేంద్రంలో ఊరేగింపు నిర్వహించారు ఇట్టి కార్యక్రమాన్ని తిలకించడానికి కామారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల నుండి రాజంపేట్ మండల కేంద్రానికి ప్రజలు తండోపతండలుగా తరలివచ్చారు ఎలక్ట్రిసిటీ అధికారులు శోభయాత్ర ముగిసే వరకు అప్రమత్తంగా ఉండి సహాయ సహకారాలు అందజేశారు ఈ శోభాయాత్రలతో ఎలాంటి అవాంచినీయ సంఘటనలు జరగకుండా భిక్కనూర్ సీఐ తిరుపతయ్య రాజంపేట్ ఎస్సై సంపత్ గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా భిక్కనూర్ సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు