ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు – ఎంపీపీ గూడెపు శ్రీనివాస్

హుజూర్ నగర్ ఫిబ్రవరి 17 (జనంసాక్షి): మండలంలోని బూరుగడ్డ దేవాలయంలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాసు, కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ లు కోరారు. శుక్రవారం సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో గల అతి పురాతన కాలం నాటి శ్రీ శాలమలీకంద శ్రీ ఆదివారహ లక్ష్మీనరసింహ, శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో భారత రాజకీయాల్లో కేసీఆర్ ప్రధాన కీలక పాత్ర పోషించనున్నాడని అన్నారు. దేశ ప్రజలందరూ కేసీఆర్ ను ప్రధానమంత్రిగా కోరుతున్నారని అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ భారతదేశం అంతటా అమలు కావాలంటే కెసిఆర్ ఒక్కడే చేయగలరని దేశ ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. కేసీఆర్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఈ భారత దేశంలో అత్యున్నతమైనటువంటి దేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.