ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.

తెలంగాణ ప్రజల చిరకాల ఆశయం అయిన ప్రత్యేక రాష్ట్ర కళను సాకారం చేసిన సోనియాగాంధీ ని తెలంగాణ ప్రజలు ఎప్పుడు గుర్తించు కుంటారని అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ అన్నారు. శుక్రవారంనాడు సోనియాగాంధీ పుట్టినరోజు సందర్బంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సోనియాగాంధీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఇస్తే ఆంధ్ర లో పార్టీ పూర్తి తుడుచుకు పోతుందని తెలిసిన విద్యార్థుల బలిదానాలు నిలిపివేయాలని ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలంటే తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆమె రుణం తీర్చుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాచన్న,మండల పార్టీ ఉపాదక్షుడు సలీం, మైనార్టీ సెల్  ప్రెసిడెంట్ నసీరోద్దీన్,మండల బీసీ సెల్ ప్రెసిడెంట్  కె.సర్వేశ్వర్, మండల యూత్ ప్రెసిడెంట్ సాయి బాబా మండల పార్టి కార్యదర్శులు వేంకటేశం,శంకర్ రెడ్డి, ఎంపీటీసీ బాల్ రెడ్డి, అబ్రాహామ్, ప్రభాకర్ రెడ్డి, ,పాండు, వివిధ గ్రామాల నాయకులు, పీ.దేవరాజ్, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.