చంద్రబాబుకు భయం పట్టుకుంది

– అందుకే సీబీఐ సమ్మతి ఉత్తర్వులను రద్దుచేశారు!

– అవినీతిపై రాష్ట్రాలకు సార్వభౌమత్వం ఉండదు

– కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ

న్యూఢిల్లీ, నవంబర్‌17(జ‌నంసాక్షి): ఆంధరప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు జారీచేసిన సమ్మతి ఉత్తర్వులను రద్దుచేయడం చూస్తుంటే, బాబుకు భయం పట్టుకుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ విషయమై స్పందించారు. తీవ్రమైన తప్పులు చేసినవారే సీబీఐకి భయపడి సమ్మతి ఉత్తర్వులను రద్దు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో శనివారం జరిగిన విూడియా సమావేశంలో జైట్లీ మాట్లాడారు. శాంతిభద్రతల విషయం రాష్ట్రాల పరిధిలోనే ఉన్నప్పటికీ అవినీతి విషయంలో ఏ రాష్ట్రానికి సార్వభౌమాధికారం లేదని జైట్లీ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఏదో జరుగుతుందన్న భయంతోనే చంద్రబాబు ప్రభుత్వం సీబీఐ సమ్మతి ఉత్తర్వులను రద్దు చేసిందని వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రాల్లో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడంలో భాగంగానే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సీబీఐ విచారణ చేపట్టకుండా సమ్మతిని రద్దు చేస్తున్నాయని జైట్లీ అభిప్రాయ పడ్డారు. ఇలాంటి చర్యలతో ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతారన్నారు. కేంద్రం సీబీఐ, ఇతర సంస్థలపై ఎలాంటి ప్రభావం చూపదని, ఆధారాలతో వారిపని వారు చేసుకుంటారన్నారు. వారి బాధ్యతల్లో కేంద్రం ప్రమేయం ఉండదన్నారు. దీనిలో భాగంగానే పలు ఫిర్యాదులతో సీబీఐ అధికారులు ఏపీలో దాడులు జరిపి ఉంటారని జైట్లీ పేర్కొన్నారు. ఏపీలో ఎంత అవినీతి జరిగి ఉంటే చంద్రబాబు ఆ విధంగా భయపడి సీబీఐనే అడ్డుకొనే ప్రయత్నం చేశారో అర్థం చేసుకోవచ్చునన్నారు.