చంద్రబాబు దీక్షకు మద్తుగా జిల్లాల్లో నిరసనలు
ఆందోళనలుచేపట్టిన టిడిపి శ్రేణులు
కేంద్రం తీరుపై మండిపడ్డ మంత్రి దేవినేని
విజయవాడ,ఫిబ్రవరి11(జనంసాక్షి): కేంద్రం వైఖరికి నిరసనగా ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా ఏపీలో టీడీపీ శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టారు. ఆయా జిల్లాల్లో టీడీపీ శ్రేణులు దీక్షలు, ర్యాలీలు చేపట్టారు. ప్రధాని మోదీ కళ్లు తెరిపించేందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాటదీక్ష చేపట్టారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ఏపీలో మోదీ అన్నీ అబద్దాలు చెప్పారని విమర్శించారు. మోదీ బాధ్యతారహితంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఏపీకి ఇచ్చిన విభజన హావిూలు అమలు చేయాలన్నదే తమ డిమాండ్ అని మంత్రి స్పష్టం చేశారు. విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ ఎ/-లాంట్ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం విషయంలో కేంద్రం అడిగిన లెక్కలన్నీ ఇచ్చామని, పోలవరం తుది అంచనాలకు కేంద్రం ఆమోదం తెలపాలన్నారు. ఏపీకి రావాల్సిన బకాయిలన్నీ వెంటనే విడుదల చేయాలని మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. విజయవాడలోని మొగల్రాజపురంలో ఎమ్మెల్యే గ్దదె రామ్మోహన్ ఆధ్వర్యంలో ధర్మపోరాట దీక్ష చేపట్టారు. చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు మద్దతుగా తిరుపతి మున్సిపల్ ఆఫీసు ఎదుట టీడీపీ నేతలు దీక్షకు దిగారు. చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు సంఘీభావంగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నిరసన ర్యాలీ చేపట్టారు. తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో చంద్రబాబుకు దీక్షకు మద్దతుగా టీడీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఒకరోజు దీక్ష చేపట్టారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు మద్దతుగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన సంఘీభావ దీక్షకు టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. నరసరావుపేటలో బాబు దీక్షకు మద్దుతగా స్పీకర్ కోడెల శివప్రసాద్ దీక్ష ప్రారంభించారు. అటు మార్కెట్ సెంటర్లో మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని దీక్ష చేపట్టారు. ధర్మపోరాట దీక్షకు మద్దతుగా కర్నూలు ఎన్టీఆర్ సర్కిల్లో టీడీపీ సీనియర్ నేత ఉమాపతినాయుడు ఆధ్వర్యంలో సంఘీభావ దీక్ష చేపట్టారు. అటు అదోనిలో సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు జర్నలిస్టులు సంఘీభావం తెలిపారు. ధర్మపోరాట ధీక్షకు మద్దతుగా ముమ్మిడివరంలో టీడీపీ నేతలు దీక్ష చేపట్టారు. టీడీపీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. దీక్షకు మద్దతుగా శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణుల నిరాహారదీక్ష చేపట్టారు. కడప జిల్లా రాజంపేటలో టీడీపీ నేతలు చెంగల్రాయుడు, సుధాకర్ దీక్ష చేపట్టారు.