చచ్చేవరకు జైలు జీవితమే

అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు

నైనిటాల్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఓ బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడిని చివరి శ్వాస వరకూ జైలులోనే గడిపేలా ఉత్తరాఖండ్‌ కోర్టు జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. తనకూతురిలాంటిదని కూడా చూడకుండా సొంత మామే బాలికపై నిత్యం అత్యాచారినికి ఒడిగట్టాడు. తల్లిదండ్రులు మరణించడంతో చిన్నారి మామయ్య ఇంటికి వచ్చి ఉంటోంది. బాలికకు 14 ఏళ్లు రాగానే మామయ్యే కామాంధుడిగా మారి

బాలికపై పలు సార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చి మృతశిశువుకు జన్మనిచ్చింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన మామయ్యే కామాంధుడిగా మారి బాలికను గర్భవతిని చేసినందున 50 ఏళ్ల వయసుగల నిందితుడు చివరి శ్వాస వదిలే దాకా జైలులోనే ఉండేలా శిక్ష విధిస్తూ కోర్టు జడ్జి జినేంద్ర కుమార్‌ శర్మ తీర్పు ఇచ్చారు. దీంతో పాటు అల్మోరా జిల్లా మెజిస్టేట్ర్‌ బాధిత బాలికకు రూ.7లక్షల నష్టపరిహారం 30 రోజుల్లోగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.