చలిమంట ప్రమాదానికి దారితీయగా ఆరుగురు సజీవదహనం

, హైదరాబాద్‌: ఇండోనేషియాలోని జావా ద్వీపంలోని ఓ అడవిలో కొందరు పర్యాటకులు చలిమంట కాచుకుంటుండగా ఉన్నట్టుండిఅడవి మొత్తానికి మంటలు వ్యాపించాయి. దీంతో ఆరుగురు పర్యాటకులుఅక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు ఎన్‌డీఎమ్‌ఏ(నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ) ప్రతినిధి సుటోపో తెలిపారు.