చలో అసెంబ్లీకి మద్దతు: రాజ్‌నాథ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): వీలేనంత త్వరలో కేంద్రం పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణపై కేంద్రం ఎప్పుడు బిల్లు పెట్టినా తాము మధ్మతు ఇస్తామన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి రాజ్‌నాథ్‌ సింగ్‌ మద్దతు తెలిపారు.
తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని రజ్‌నాథ్‌ సింగ్‌ సూచించారు. తెలంగాణ ఇస్తామన్న కాంగ్రెస్‌ మాట తప్పిందని ఆయన విమర్శించారు. ఆహారభద్రత బిల్లుపై ఆర్డినెన్స్‌ తీసుకొస్తామనడం అప్రజాస్వామికమని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. వచ్చే పార్టమెంట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.