చావు నోట్లో తలపెట్టి కేసీఆర్‌ తెలంగాణ తెచ్చిండు..

` ఆయన అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం
` మంత్రి హరీశ్‌ రావు
మెదక్‌(జనంసాక్షి): కేసీఆర్‌ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం వల్లే మన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావున్నారు. ఆదివారం జిల్లాలోని నర్సాపూర్‌లో నిర్వహించిన సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యేగా సునీతా లక్ష్మారెడ్డిని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యే మదన్‌ రెడ్డిదేనని చెప్పారు.మదన్‌ రెడ్డిని ఎంపీ చేసే బాధ్యత తాను తీసుకుంటానని హావిూనిచ్చారు. కర్ణాటకలో మూడు గంటల కరెంట్‌ ఇస్తున్నామని మేము చెప్పాం. కర్ణాటకలో 5 గంటలే కరెంట్‌ ఇస్తున్నామని నిన్న డీకే శివకుమార్‌ నిజాలు చెప్పారు. కానీ 5 గంటలు ఇవ్వట్లేదు 3 గంటలే ఇస్తుందని తెలిపారు. డీకే శివకుమార్‌ మాటలతో కాంగ్రెస్‌ పార్టీకి సమాధి కట్టుకుంది. స్వయంగా డీకే శివకుమారే 5 గంటలు కరెంట్‌ ఇస్తున్నామని చెప్పాక ఇంకా బస్సెందుకు మాకు కర్ణాటక రావడానికని ఎద్దేవా చేశారు.రైతు బంధు డబ్బులు ఇవ్వొద్దని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌ వాళ్లకి సిగ్గు లేదని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి మూడు గంటల కరెంట్‌ చాలు అంటాడు. డీకే శివకుమార్‌ ఐదు గంటల కరెంట్‌ ఇస్తున్నామని అంటాడు. రైతులందరూ కలిసి కాంగ్రెస్‌ పార్టీని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. తస్మాత్‌ జాగ్రత్త..మోసపోతే గోస పడుతాం.మెడవిూద తలకాయ ఉన్నోడు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయడన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే మన కళ్లలో మనం పొడుచుకున్నట్టేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అన్ని అబద్ధాలు చెబుతుంది. కాంగ్రెస్‌ వాళ్లు బట్టేబాజ్‌ గాళ్లు. వాళ్లవి తిట్లు..మనవి కిట్లు. కాంగ్రెస్‌ బూతులు కావాలా..తెలంగాణ భవిష్యత్తు కావాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.