చింతకుంట్ల గ్రామంలో మరుగుదొడ్డి దినోత్సవ కార్యక్రమం ఉపసర్పంచ్ యేకుల సురేష్

కొండమల్లేపల్లి నవంబర్ 19 జనం సాక్షి న్యూస్ : మండల కేంద్రంలో శనివారం నాడు చింతకుంట్ల గ్రామపంచాయతీలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంపూర్ణ స్వచ్ఛత కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామంలోని ప్రజలతో, విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలందరూ మరుగుదొడ్డి వాడే విధంగా ఉండాలన్నారు. గ్రామంలోని ప్రజలందరూ ప్రతి కుటుంబానికి ఒక మరుగుదొడ్డిని ఏర్పాటు చేసుకొని మల మూత్ర విసర్జనకు మరుగుదొడ్డిని ఉపయోగించుకొని గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రుద్రమ శీను ఉపసర్పంచ్ యేకుల సురేష్, కార్యదర్శి కిరణ్, వార్డు సభ్యులు, పాఠశాల సిబ్బంది, గ్రామ ప్రజలు, మహిళా సంఘాలు అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు