చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి
చైన్నై : ఓ నిందితుడు చేతిలో కత్తి పోట్లకు గురై చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ సి. త్యాగరాజన్ (48) అపోలో ఆసుపత్రిలో శనివారం తెల్లవారు జామున మృతి చెందాడు. కొత్తూర్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దోపిడీ కేసులో
సంబంధం ఉన్న విమల్రాజ్ (20) అనే ఓ నిందితుడ్ని విచారణలో భాగంగా ప్రశ్నించేందుకు వెళ్లగా అతను త్యాగరాజన్పై కత్తితో దాడి చేశాడు. చెల్లమ్మల్ తొట్టం ప్రాంతంలోని ఐన్హౌన్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఈ దాడిలో త్యాగరాజన్కు మెడపై తీవ్రగాయాలయ్యాయి.