చీకటి జీవోలతో దోచుకున్న ఘనులు

బిఆర్‌ఎస్‌పై మండిపడ్డ ఎంపి చామల
హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి):  అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రుణమాఫీ చేశామని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌ ఎందుకు రుణమాఫీ చేయలేదని ప్రశ్నించారు. 2018లో మరోసారి రుణమాఫీ మాట ఇచ్చి మర్చిపోయారని విమర్శించారు. 2023 వరకు రైతులు వారికి గుర్తురాలేదని చెప్పారు. భారాస హయాంలో విూరిచ్చిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదు. రాజీనామా చేయాలని హరీశ్‌రావును అడిగితే నాటకాలాడుతున్నారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజలకు విూరు మంచి చేసి ఉంటే ఎన్నికల్లో భారాసను ఎందుకు ఓడిరచారు? విూ ప్రభుత్వంలో చీకటి జీవోలిచ్చి ఎంత కొల్లగొట్టారో తెలుసుకునేందుకే మాకు నెల రోజులు పట్టిందని చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.