చెన్నై క్రికెట్ అభిమానులకు శుభవార్త
ఢిల్లీ, జనంసాక్షి: క్రికెట్ అభిమానులు నిరభ్యంతరంగా ఇవాళ్టి ఐపీఎల్ మ్యాచ్ను తమ నగరంలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో వీక్షించవచ్చు .వివాదంలో ఉన్న మూడు స్టాండులను మినహాయించి స్టేడియం వినియోగించుకోవచ్చని సుప్రీకోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో ఈ మ్యాచ్కోసం ఇప్పటికే టికెట్లు కూడా తీసుకున్నవారు మ్యాచ్ తిలకించడానికి ఎలాంటి అభ్యంతరమూ ఉండబోదు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ డేర్ డెవిల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఇక్కడ మ్యాచ్ జరగనుంది.