చెన్నై చేరుకున్న పవన్‌ కళ్యాణ్‌

చెన్నై,నవంబర్‌21(జ‌నంసాక్షి): జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బుధవారం చెన్నై చేరుకున్నారు… చెన్నై విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది… పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చిన జనసేన కార్యకర్తలు, పవర్‌ స్టార్‌ అభిమానులు ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పవన్‌తో సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్‌ పోటీ పట్టారు. ఫ్యాన్స్‌ తాకిడి ఎక్కువ కావడంతో బౌనర్స్‌ సహాయంతో కారు

ఎక్కారు పవన్‌ కల్యాణ్‌. కాగా, పవన్‌ కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం అందుతోంది. పవన్‌ విూడియా సమావేశానికి ఒక రోజు ముందే సమాచారం అందించే జనసేన పార్టీ… ఈసారి రెండు రోజుల ముందే సమాచారం ఇవ్వడంతో జనసేనాని చెన్నై పర్యటనపై ఆసక్తి నెలకొంది.