చెన్నై చేరుకున్న ముంబయి పోలీసులు
చెన్నై ,జనంసాక్షి: స్పాట్ ఫిక్సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ముంబయి పోలీసులు ఈ రోజు ఉదయం చెన్నై చేరుకున్నారు. శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మీయప్పన్ను విచారించడానికి వారు ఇక్కడికి వచ్చారు. మీయప్పన్ తరపున తాను ఐపీఎల్లో బెట్టింగ్కు పాల్పడినట్లు విందూ దారాసింగ్ తెలిపిన నేపథ్యంలో పోలీసులు గురునాథ్ మీయప్పన్తో పాటు చెన్నై సూపర్కింగ్స్ జట్టుకు చెందిన మరికొందరు అధికారులను కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.