చెయనాలోమళ్లీ పేలుడు

88e3xg0g
హైదరాబాద్‌: చెయనాలోని దక్షిణ ప్రాంతమైన గ్వాంక్జీ జువాంగ్‌లో గురువారం మరో పేలుడు చోటుచేసుకుంది. బుధవారం జరిగిన పేలుళ్లలో ఏడుగురు మృతిచెందగా మరో 51 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో స్థానిక పాలనావ్యవహారాల కార్యాలయ సమీపంలో ఓ భవనం వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ ఆరంతస్తుల భవనం కూలిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రాణనష్టం గురించి వివరాలు తెలియరాలేదు. ఈ వరస పేలుళ్ల ఘటనల నేపథ్యంలో పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. 33 ఏళ్ల ఈ వ్యక్తి పేలుళ్లకు కారణాలుగా భావిస్తున్న లెటర్‌ బాంబులను సరఫరా చేయడానికి కొందరిని నియమించుకున్నట్లు సమాచారం.