చెరువులోకి తూసుకెళ్లిన స్కూలు బస్సు

20 మంది విద్యార్థులకు గాయాలు
లక్నో,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి):  ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం తప్పింది. వేగంగా వచ్చిన స్కూల్‌ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మంగలశారం ఉదయం ఖైరా గ్రామ సవిూపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది విద్యార్థులు ఉన్నారు. ఘటనాస్థలికి సవిూప గ్రామస్తులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనతో బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.