చైనా ప్రధానికి రాష్ట్రపతి భవన్‌ వద్ద ఘనస్వాగతం

న్యూఢిల్లీ : భారత్‌కు రావడం చాలా ఆనందంగా ఉందని చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ అన్నారు. చైనా ప్రధానికి రాష్ట్రపతి భవన్‌ వద్ద ఘనస్వాగతం లభించింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైనా ప్రధాని మాట్లాడుతూ భారత్‌ తమకు ముఖ్యమైన పొరుగు దేశమని పేర్కొన్నారు. తన పర్యటనతో ఇరు దేశాల ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.