ఛత్తీన్గఢ్ ఘటనకు మేమే బాధ్యులం : మావోయిస్టులు
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ మారణకాండకు తామే బాధ్యులమని మావోయిస్టులు ప్రకటించుకున్నారు. సల్వాజుడుం అకృత్యాలకు నిరసనగా ప్రతీకారం తీర్చుకున్నామని సీపీఐ (మావోయిస్టు) దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ ప్రతినిధి పేరిట లేఖను పంపారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు అధికార భాజపా, విపక్ష కాంగ్రెస్ రెండు బాద్యత వహించాల్సిందేనని. . అందుకే కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకున్నామని అందులో పేర్కొన్నారు.