ఛత్తీస్‌గఢ్‌ ఘటనపై చర్యలు చేపట్టిన హోంశాఖ

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఛత్తీస్‌గఢ్‌ ఘటనపై కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టింది. 2వేల మంది పారామిలటరీ బలగాలను ఛత్తీస్‌గఢ్‌కు కేంద్ర హోంశాఖ పంపింది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది.మావోయిస్టుల దాడిలో సల్వాజుడుం చీఫ్‌ మహేంద్రకర్మతో పాటు ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే.