ఛత్తీస్ఘడ్లో భారీ ఎన్కౌంటర్
8మంది మావోలు,ఇద్దరు పోలీసుల మృతి
రాయ్పూర్,నవంబర్26(జనంసాక్షి): చత్తీస్ఘడ్లో సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని సక్లార్ గ్రామంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది నక్సల్స్ మృతిచెందారు. డిస్టిక్ట్ర్ రిజర్వ్ గార్డ్స్, కోబ్రా దళాలు, సీఆర్పీఎఫ్ పోలీసులు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నారు. అయితే ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు డీఆర్జీ పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎన్కౌంటర్లో మరో నక్సల్ గాయపడ్డాడు. అతని వద్ద నుంచి బర్మా గన్ను స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్, పోలీసుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సీపీఐ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దళానికి చెందిన నక్సల్స్ ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. మావోల ప్రధాన ప్రాంతమైన సుక్మా ప్రాంతంలో పోలీసు దళాలు ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఆదివారం
బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు భద్రత సిబ్బంది కూడా ప్రాణాలు విడిచారు.