జంతువధ చేస్తున్న 36మంది అరెస్ట్

 36 held for animal sacrifice at Kaup fest Mangaluru
మంగళూరు: కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో నిర్వహించే కాప్ ఫెస్ట్‌లో జంతువులను వధిస్తున్న 36 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతీ ఏటా జరుపుకునే ‘సుజ్జీ మరిపూజ ఫెస్ట్‌’లో మూగజీవాలను (కోళ్లు,గొర్రెలు,మేకలు,ఇతర జీవులు) వధించడంపై గతంలో కర్ణాటక హైకోర్టు నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని పట్టించుకోకుండా ఉత్సవంలో భాగంగా దేవాలయం ముందు మాంసం కోసం మూగజీవాలను వధిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. మూగజీవాలను వధించడంపై నిషేధం విధించాలని ఓ వ్యక్తి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా..ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు ఉడిపిలోని దేవాలయ పరిసరాల్లో జంతుబలిపై నిషేధం విధిస్తూ గతంలో తీర్పునిచ్చింది.