జగన్‌పై దాడి బాబే చేయించారనడం హాస్యాస్పదం

– ఇలాంటి సంస్కృతి టీడీపీకి ఎన్నడూ లేదు

– జగన్‌ హత్యాయత్నం కేసులో సీరియస్‌ గా ఉన్నాం

– టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌

అనంతపురం, నవంబర్‌19(జ‌నంసాక్షి) : తనపై హత్యాయత్నం ఘటనలో సీఎం చంద్రబాబు హస్తం ఉందని వైసీపీ అధినేత జగన్‌ చెప్పడాన్ని టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంలో జగన్‌ ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అనంతపురంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమావేశంలో పయ్యావుల మాట్లాడారు. కోడికత్తి ఘటనలో త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. హత్యలు, దాడులు చేయించే సంస్కృతి టీడీపీకి లేదని స్పష్టం చేశారు. పోరాటయోధుడిని అని చెప్పుకునే జగన్‌ చిన్న కత్తిదాడికే 10 రోజులు విశ్రాంతి పేరుతో పడుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ కు సానుభూతి, ప్రచారం రావాలనే ఉద్దేశంతోనే దాడిచేసినట్లు నిందితుడు శ్రీనివాసరావు స్వయంగా అంగీకరించాడని గుర్తుచేశారు. ఈ కోడికత్తి డ్రామాను ఏపీ ప్రజలు సైతం కోడి పందెంలాగే సరదాగా తీసుకున్నారని వ్యాఖ్యానించారు. జగన్‌ పై జరిగిన దాడిపై ప్రభుత్వం సీరియస్‌ గా ఉందని స్పష్టం చేశారు. వీలైనంత తొందరగా దోషులను శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏపీ అభివృద్ధికి సహకరిస్తామని, ప్రత్యేక ¬దా ఇస్తామని చెబితేనే బీజేపీతో కలిశామని, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ ప్రజలను మోసం చేసిందన్నారు. అయినా రాష్ట్రాన్ని అన్ని రంగా/-లలో అభివృద్ధిపర్చేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేక ¬దా, ప్రత్యేక ప్యాకేజీకోసం కేంద్రంతో చంద్రబాబు పోరాడుతుంటే, చంద్రబాబుకు అండగా నిలవాల్సిన జగన్‌, పవన్‌లు ఏపీకి అన్యాయం చేయాలని చూస్తున్న మోదీకి మద్దతివ్వండం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని సరియైన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.