జడ్పీ చైర్మన్ పుట్ట మధు పరామర్శలు

జనం సాక్షి , మంథని : కరీంనగర్ రెనె హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్య పల్లె గ్రామానికి చెందిన బొడిపెల్లి శ్రీనివాస్ ను, అలాగే మంథని మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన కుమ్మరికుంట లక్ష్మీని, ఆరోగ్య హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మంథని పట్టణానికి చెందిన మోరే సాయిరాం లను శుక్రవారం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పరామర్శించి, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని పుట్ట మధు ఈ సందర్భంగా డాక్టర్లను కోరారు.