జయలలిత సమాధిపై పిటిషన్‌ తిరస్కరణ

న్యూఢిల్లీ,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితా స్మారక నిర్మాణాన్ని ఆపాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. మద్రాసు హైకోర్టు ఆదేశాలపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం వెల్లడించింది. జయలలిత మెమోరియల్‌ నిర్మాణానికి గతంలో మద్రాస్‌ కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.  మెరీనా బీచ్‌లో జయలలిత స్మారక నిర్మించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. ఇప్పటికే మెరీనా బీచ్లో ఎంజిఆర్‌ సమాధి ఉంది.