జర్నలిస్టులందరికీ ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తా: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.

జర్నలిస్టులందరికీ ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తా: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.

నేరేడుచర్ల(జనంసాక్షి )న్యూస్. జర్నలిస్టులందరికీ ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తానని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నేరేడుచర్ల జర్నలిస్టులు ఎమ్మెల్యేను కలిసి ఇండ్ల స్థలాలతో పాటు, ఇంటి నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ… జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తామని అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని జర్నలిస్టులందరికీ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని అన్నారు. జర్నలిస్టులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేలా కృషి చేయాలని కోరారు. జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలతో పాటు, ఇంటి నిర్మాణానికి అవసరమైన నిధులు కూడా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల జర్నలిస్టులు చామకూరి వీరయ్య గౌడ్(ప్రజాపక్షం), బుడిగె శంకర్ గౌడ్(v6 వెలుగు), సట్టు శ్రీనివాసు(నవతెలంగాణ), తునికిపాటి బాలకృష్ణ(ఆదాబ్ హైదరాబాద్), రావిరాల యుగంధర్ (జనం సాక్షి) చింతల శ్రీకాంత్(అక్షిత), పర్వతం పరమేష్ (ప్రజా జ్యోతి) తదితరులు పాల్గొన్నారు.