జర్నలిస్టులకు సుప్రీంలో ఊరట

` ఇళ్ల స్థలం కేసులో సానుకూల తీర్పు
` వారికి కేటాయించిన స్థలంలో ఇళ్లు కట్టుకునేలా ఆదేశాలు
` తీర్పును స్వాగతిస్తూ సిజెఐకి మంత్రి కెటిఆర్‌ కృతజ్ఞతలు
న్యూఢల్లీి(జనంసాక్షి): జర్నలిస్టులకు హైదరాబాద్‌లో ఇళ్లస్థలాల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్‌ జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నారు. జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసులో విచారణ జరిగింది. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడదని చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు 12 ఏళ క్రితం ప్రభుత్వాన్ని స్థలాన్ని కేటాయించింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌ల గురించి నేను మాట్లాడటం లేదు. ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలి. రూ.8వేల నుంచి రూ.50వేల వరకు జీతం తీసుకునే 8వేల మంది జర్నలిస్టుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నాం. వారికి భూమి కేటాయించారు. కానీ అభివృద్ధి చేయలేదు. వారంతా కలిసి స్థలం కోసం రూ.1.33 కోట్లు డిపాజిట్‌ చేశారు. జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోవడానికి మేం అనుమతి స్తున్నాం. వారి స్థలంలో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్‌ ముందు లిస్ట్‌ చేయాలని సీజేఐ ఎన్వీ రమణ ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ జర్నలిస్టు సంఘం దీర్ఘకాలిక డిమాండ్‌ను పరిష్కరించినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇది తెలంగాణ ప్రభుత్వం పాత్రికేయ మిత్రులకు తమ వాగ్దానాన్ని నెరవేర్చడంలో సహాయపడుతుందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.తెలంగాణ జర్నలిస్టుల నివాసాల కోసం సుప్రీంకోర్టులో ఈ కేసు త్వరగా పరిష్కారమయ్యేందుకు ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుకి తెలంగాణ విూడియా అకాడవిూ చైర్మన్‌ టీయూడబ్ల్యూజే అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్‌ లు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జర్నలిస్టుల కోసం.. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసును పరిష్కరించినందుకుగాను సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ధర్మాసనానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఇది తెలంగాణ ప్రభుత్వ కృషి ద్వారా అందిన తీపి కబురు అని అల్లం నారాయణ అన్నారు. అలాగే, జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు విషయంలో కృషి చేసి, చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల ఇండ్ల సమస్యను పరిష్కరించినందుకు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణకు మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. దీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న కేసులో తుది తీర్పు వెల్లడిరచినందుకు సీజేఐకి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నట్లు మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ లో పేర్కొన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హావిూని నెరవేర్చేందుకు సుప్రీంకోర్టు తీర్పు తోడ్పడుతుందన్నారు. 15 ఏళ్లుగా పెండిరగ్‌ లో ఉన్న జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసుపై చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం విచారించింది.