జవహార్‌లాల్‌ నెహ్రూకు ఘన నివాళి అర్పించిన నేతలు

న్యూఢిల్లీ, జనంసాక్షి: భారతదేశ తొలి ప్రధాని పండిత్‌ జవహార్‌లాల్‌ నెహ్రూ 49 వ వర్ధంతి సందర్బంగా పలువురు నేతలు ఆయనకు సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు యమునా నదీ తీరాన ఉన్న నెహ్రూ సమాధి ‘శాంతివన్‌’ ను సందర్శించి పుష్పంజలి ఘటించారు. ఈ సందర్భంగా గాయకులు శాంతివన్‌ వద్ద దేశ భక్తి గేయాలు, భక్తి గేయాలను ఆలపించారు.