జస్టిన్‌ వర్మ సూచనల ప్రకారం చట్ట సవరణలు చేస్తాం : ప్రధాని

ఢిల్లీ: అత్యాచార ఘటనలపై జస్టిన్‌ వర్మ కమిటీ సూచనల ప్రకారం అవసరమైన చట్ట సవరణలు చేస్తామని, కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేర్కొన్నారు. ఆయన మేరకు జస్టిన్‌ వర్మకు లేఖ రాశారు. ఆ లేఖలో నివేదిక సమర్పణ పట్ల ప్రధాని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 30 రోజుల్లోనే నిబద్దతతో పని పూర్తి చేసింనందుకు జస్టిన్‌ వర్మ, లీలాసేథ్‌, గోపాల్‌ సుబ్రహ్మణ్యంలను ప్రధాని ప్రశంసించారు.