జింబాబ్వే పర్యటనకు భారతజట్టు ఎంపిక నేడు

ముంబయి: ఈ నెల 24న జింబాబ్వేతో ఐదు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. ద్వైపాక్షిక సిరీస్‌ కోసం జాతీయ సెలక్టర్లు ఈరోజు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. జట్టు ఎంపిక చేయడానికి సెలక్షన్‌ కమిటీ ఈరోజు సమావేశం కానుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గాయం కారణంగా ముక్కోణపు సిరీస్‌ నుంచి అర్ధంతరంగా తప్పుకున్న టీమ్‌ ఇండియా కెప్టెన్‌ ధోని జింబాబ్వే పర్యటనకూ దూరమయ్యే అవకాశముంది. తొలి మూడు వన్డేలకు హరారేలోని హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌, చివరి రెండు వన్డేలకు బులవాయోలోని క్వీన్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ అతిధ్యమిస్తాయి.