జిపి కార్మికుల సమస్యలపై చలో కలెక్టరేట్

జైనథ్ జనం సాక్షి ఫిబ్రవరి 20
జైనథ్ మండలంలోని బోరజ్ గ్రామం నుండి ఆదిలాబాద్ కలెక్టర్ ఆఫీస్ వరకు అదిలాబాదులో వివిధ మండలాలలో పనిచేస్తున్న జిపి కార్మికుల సమస్యలపై పోరాటం చేసిన సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్ర 100 నుండి 200 మంది ఈ పాదయాత్రలో పాల్గొన్నారు జిపి కార్మికుల డిమాండ్లు కనీస వేతనం 26,000 వేల రూపాయలు చెల్లించాలని జీవో నెంబర్ 60 ప్రకారం తమకు వేతనాలు ఇవ్వాలని జీవో నెంబర్ 51ని సరిచేసి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని తమకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని జిల్లాలో ఉన్న జిపి కార్మికులందరికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టర్ కు వినతి పత్రాన్ని ఇచ్చారు ఈ పాదయాత్రలో పాల్గొన్నవారు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ కిరణ్ బొజ్జ ఆశన్న వివిధ గ్రామాల జి పి కార్మికులు పాల్గొన్నారు.