జిల్లా గ్రంధాలయ సంస్థ జోగులాంబ గద్వాల్ యొక్క జిల్లా సర్వసభ్య సమావేశం.

జిల్లా గ్రంధాలయ సంస్థ జోగులాంబ గద్వాల్ యొక్క జిల్లా సర్వసభ్య సమావేశం.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 29 జనం సాక్షి.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జంబు రామన్ గౌడ గారి అధ్యక్షత, పాలక మండలి సభ్యులు జోగులాంబ గద్వాల జిల్లా అధికారుల సమక్షంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని శాఖా గ్రంథాలయంలో యందు ఉన్న పరిస్థితులను పరిశీలించి వాటి భవన మరమ్మత్తులు చేపట్టుటకు, వాటి అభివృద్ధి కొరకు జిల్లా నిధుల నుండి వాడుకొని ఆయా పనులను పూర్తి చేయుటకు నిర్ణయించడం జరిగినది. ఈ సందర్భంగా చైర్మన్ గ్రామపంచాయతీల నుండి రావాల్సిన గ్రంథాలయపన్ను సక్రమంగా వసూలు కావడంలేదని, దానివలన గ్రంథాలయ అభివృద్ధి కుంటుపడుతుందని అన్ని విధాలుగా లైబ్రరీలను పాఠకులకు అందుబాటులో ఉండే విధంగా పుస్తకాలను, ఫర్నీచర్ ను కొనుగోలు చేసి ఏర్పాటు చేయడం జరుగుతుందనారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ పాలకమండలి సభ్యులు లోకేశ్వర్ రెడ్డి , జి కృష్ణయ్య, గుమ్మ గోవర్ధన్,జిల్లా విద్యాధికారి సిరాజుదిన్, జిల్లా పౌర సంబంధాల అధికారి చెన్నమ్మ,వయోజన విద్య అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ న్యుమాన్,జిల్లా డిఎల్పిఓ, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి శ్యాంసుందర్,లైబ్రెరీయన్ రామాంజనేయులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొనటం జరిగింది