జీతాల కోసం అమరావతిలో స్వీపర్ల ఆందోళన

అమరావతి,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  సచివాలయంలో పనిచేసే స్వీపర్లు ఆందోళన బాట పట్టారు. గత మూడునెలలుగా వేతన బకాయిలు చెల్లించడం లేదని, దీంతో తాము పస్తులుండాల్సి వస్తోందని వారు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దాదాపు 200 మంది స్వీపర్లు సచివాలయం మెయిన్‌ గేటు దగ్గర బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… మూడు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదన్నారు. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, విధిలేని పరిస్థితుల్లోనే తాము ఆందోళనకు దిగామన్నారు.