జులై 2, 3 తేదీల్లో విడుదలయ్యేనున్న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌

ఢిల్లీ : జులై మొదటివారంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం కన్పిస్తోంది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వానికి అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తోంది. జులై 2,3 తేదీల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.