జూన్‌ 18న బీహార్‌ బంద్‌కు బీజేపీ పిలుపు

పాట్నా,(జనంసాక్షి): బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. జూన్‌ 18న బీహార్‌ బంద్‌కు బీజేపీ పిలుపు నిచ్చింది. నితీష్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ బీహార్‌ నేత, ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోడీ డిమాండ్‌ చేశారు. బీహార్‌ రాజకీయాల్లో ఇది చీకటిరోజుగా ఇయన అభివర్ణించారు. జేడీయూనుంచి బీజేపీ విడిపోవాలని ఏనాడు కోరుకోలేదని అన్నారు. నితీష్‌ తమకు ద్రోహం చేశారని సుశీల్‌ మోడీ ఆరోపించారు.నితీష్‌ కుమార్‌ రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలని చెప్పారు. జేడీయూకు భావసారూప్య పార్టీగా ఇన్నాళ్లూ పనిచేశామని ఆయన చెప్పారు. కాగా మోడీ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు బీజేపీ స్పష్టం చేసింది. పొత్తు 10 సార్లు తెగినా మేం నిర్ణయం మార్చుకోమని పేర్కొంది.