జేడీయూ ఎంపీలు,ఎమ్మెల్యేల సమావేశం

పాట్నా,(జనంసాక్షి): బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ నివాసంలో జేడియూ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమవేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశానికి బీజేపీ మంత్రులు గౌర్హాజరైన విషయం తెలిసిందే. ఎన్టీయే నుంచి వైదొలగాలని జేడీయూ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆ రాష్ట్ర గవర్నర్‌ డీవై పాటిల్‌ను నితీష్‌కుమార్‌ కలవనున్నారు.