జౌళిశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కావూరి

ఢిల్లీ: కేంద్ర జౌళిశాఖ మంత్రిగా ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు ఈరోజు ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈసదర్భంగా ఆయన మాట్లాడుతూ… వ్యవసాయ సంబంధమైన జౌళిశాఖను తనకు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. రైతులు చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయనున్నట్లు చెప్పారు.